Thursday, September 2, 2010

అమర శేఖరుడు

ఆయన మనకిక లేరు..అను భావన మన మస్థిష్కాలలో ఇంకా ముద్ర పడకుండానే సంవత్సరం గడిచిపోయింది. బహుసా ఇది అసాధ్యమేనేమో..ఎందుకంటే ఆయనను ఎలా మర్చి పోగలం. అఖిలాంధ్ర ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్న ఆయన మనకిక లేరనేది ఒక తీపి అబధ్ధం. నిజానికి మరణం మనుషుల్ని దూరం చేసినా మనసుల్ని దగ్గర చేస్తుంది.
గత సం వత్సరం ఆయన తిరిగిరాని లోకాలకు తరలి వెళ్ళిన సందర్భం లో నా బ్లాగులో పోస్టు పునర్ముద్రిస్తున్నాను...
రోజూ కనిపించే
మీరు......
సమాధిలోకి వెల్తున్నపుడు
మీచుట్టూ ఎవరూ ఉండరు
ఎవరూ ఏడ్చినట్లనిపించదు
ఏ ప్రార్ధనలు మీకు వినబడవు
ఎన్నో ప్రశ్నలు మాత్రం
మీ చుట్టూ నాట్యం చేస్తూంటాయి
మీ పార్ధివ శరీరం బూడిదయి పోతూంటే
మీకేమీ బాధనిపించదు...
రెండోరోజుకల్లా మీ ఫోటో
చిరునవ్వుతో మిమ్మల్ని పలకరిస్తుంది...
మీకందరూ కనిపిస్తారు
మీరెవరికీ కనపడరు...
పరామర్శల ముసుగేసుకుని
వచ్చేవారందరూ
ఫోటో ఫ్రేములో బిగించిన
మిమ్మల్నిచూస్తూంటారు
అశ్రునయనాలతో
మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ
వెళిపోతూంటారు...
ఎవరి బిజీ వారిది
మీరేమీ బాధపడినట్లుండరు...
పెరట్లో మీరు నాటిన మొక్కలు
అందమయిన పూలు పూస్తూంటాయి
పిల్లలు వాటినేచూస్తూ
ఆనందపడుతూంటారు
మీకేమీ బాధనిపించదు...
ముసలి చెట్ల స్థానంలో
కొత్త మొక్కలు మొలుస్తూంటాయి
ఈరోజెందుకో
మీరు బాధగా కనిపిస్తున్నారు
పాతసామాన్ల వాడి సంచిలో
ఇరుక్కుపోయిన మీ ఫొటో
మిమ్మల్ని చూసి జాలిపడుతూంటుంది....