Monday, December 19, 2011

కలాల కోలాహలం





నిన్నటి రోజున కవన భోజనం.
మా విశాఖ పట్నం మరియు ఉత్తరాంధ్రాకు చెందిన రచయితలు, కవులు సాహితీ సమ్మేళనం ఘనంగా జరిగింది.
కలాల కోలాహలం
(సాహితీ సమ్మేళనం)
వివిధ సాహితీ ప్రక్రియలపై పోటీలు, ప్రసంగాలు, రచనా పఠనాలు, కవి సమ్మేళనం తదితర
అంశాలపై పోటీలు నిర్వ హించారు.
అవధాన ఘనాపాటి డా. గరికపాటి ముఖ్య అతిధిగా సుప్రసిధ్ధ రచయిత్రులు, రచయితలు పాల్గొని
కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

కార్యక్రమమ్లో సత్యమూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ మోదు రాజేశ్వరరావు,
సృజన..విశాఖ కార్యదర్శి గుండాన జోగారావు, కార్యవర్గ సభ్యులు శ్రీ బి .దుర్గా ప్రసాదు విశాఖ సాహితీ మిత్రులు మరియు పాత్రికేయులు పాల్గొన్నారు.

ఉదయం తొమ్మిది గంటలనుండి సాయంత్రం ఆరు గంటల వరకూ సాగిన ఈ కార్యక్రమం లో వివిధ పోటీల విజేతలకు బహుమతి ప్రదానం కూడా జరిగింది.
సాహితీ ప్రియులందరూ సంతోషించ దగిన విషయమేమంటే
వచ్చే సమ్వత్సరం ఏప్రిల్ నెలలో
మా విశాఖ పట్నం లో
జాతీయ తెలుగు రచయితల మహా సభలు
జరగనున్నాయి.
దానికి సంబంధించిన విధి విధానాలను, తాత్కాలిక కార్యవర్గ కమిటేని ప్రతిపాదించటం కూడా జరిగింది.