వినాయక వ్రతం చేయునపుడు పసుపు వినాయకుని పూజించడం అవసరమా ?
సాధారణంగా మనం ఏదైనా వ్రతం చేసేటపు డు గాని ఇతర దేవతలని పూజించే సమయంలోనో , మరే ఇతర శుభకార్యమయినా జరిపేటపుడు విఘ్నం కలుగకుండా వినాయక పూజ చేయడం మొదటి పుజలందుకునే ఆ విఘ్న నాయకుని పసుపు రూపం చేసి పూజ చేయడం ఆయనని స్మరించడం సంప్రదాయం. కానీ వినాయకునికే పూజ జరిపేటపుడు మళ్ళీ మరో వినాయకమూర్తిని పసుపుతో ఏర్పరచి, పూజ జరపడం మూఢమైన ఆచారం. కానీ ఇది వినాయక వ్రతకల్పం లో అలవాటుగా చేరిపోయిన అనవసరమైన ఉపాంగం. మన సంస్కృతిలో చేరిన ఈ విధమైన అనవసరమైన, అర్ధరహితమైన కర్మలని శాస్త్ర అవగాహనతో దూరం చేయవచ్చు..
అందరికి వినాయక చవితి శుభా కాంక్షలు ......