Showing posts with label మం త్రాలు. Show all posts
Showing posts with label మం త్రాలు. Show all posts

Friday, November 6, 2009

పెళ్ళి పుస్తకం.. ఐదవ భాగం - బి


హిందూ వివాహ ప్రాశస్త్యము.
ఐదవ భాగము - బి
అన్ని అనుభవాల్లో పురుషుడు స్త్రీ సమానంగా ఉన్నప్పుడే స్త్రీ పురుషునికి అర్ధాంగి అవుతుంది. ఈ వివాహ బంధం ఈ లోకంలోని ఈ జన్మలలో వీరిద్దరిని కలుపుతూనే ఉంటుంది. ప్రపంచ మానవ జీవితంలో ఆయా దేశాల్లో ఆయా సంప్రదాయాల్లో తేడాలున్నా వివాహమనేది ఒక విచిత్రబంధం. మన భారతదేశమ్లో నియమముగా బ్రహ్మచర్యాన్ని గడిపిన స్త్రీ పురుషులు సంఘ శ్రేయస్సును, తమ వంశ శ్రేయస్సును, తమ శ్రేయస్సును దృష్ఠిలో ఉంచుకొని, సకల ధర్మాలకు ఆశ్రయభూతమైన ఈ సంసారం చేసుకుంటారు. దీనిలో మానవ మనస్తత్వం లో ఎన్నో మార్పులు వస్తాయి. బాధ్యత పెరుగుతుంది.
గురుకులం లో విద్యాభ్యాసం ముగించిన తరువాత శిష్యునికి గురువు
" ప్రజాతంతుం మావ్యవచ్చేత్పీ:"
నీ వంశ పరంపరను నశింపజేయకుము. ఇంటికి వెళ్ళి వివాహం చేసుకోమని ఆజ్ఞాపించును.
కనుకనే లోకజ్ఞుడగు మహాకవి కాళిదాసు రఘువంశ రాజులను వర్ణించుచూ..
ప్రజాయై గృహ మేధినాం "...... సంతానం కొరకే గ్రుహస్తులగువారని చెప్పినాడు.
సంతాన ప్రాప్తి అనంతరం వారికి గృహస్తాశ్రమ ఆశక్తి లేదని వాన ప్రస్థులగుదురని కూడ దీనిని బట్టి తెలుస్తుంది.
కనుక మానవ జీవితంలో సకల శ్రేయస్సులకు మూలభూతమైన వివాహబంధం చాలా ప్రశస్తమైనది.
కొసమెరుపు :
ఘనా దేశం లోని ' ఆసాంటే ' అనే తెగలో
వరుడు, వధువు ఇంటి కెళ్ళి తలుపు తడతాడు. లోపలున్న వధువు తిరిగి తలుపు తడుతూ సమాధానం ఇస్తే...వరుడి తల్లి , మేనమామ వధువు ఇంటికి వెళ్ళి వివాహ ప్రతిపాదన చేస్తారు.
వివాహ మంత్రాల అర్ధం...తరువాయి టపాలో...