Showing posts with label వివాహ వేడుకలు. Show all posts
Showing posts with label వివాహ వేడుకలు. Show all posts

Sunday, August 1, 2010

పెళ్ళి పుస్తకం. 15


హిందూ వివాహ ధర్మం మీద గత కొన్ని సమ్వత్సరాలుగా చేసిన అధ్యయనం వలన ఎన్నో విషయాలు తెలిసినవి. అనేక సందర్భాలలో ఈ విషయాలను బంధుమిత్రులతో పంచుకున్నపుడు వారికెంతో ఆశక్తిని కలిగించేవి. చాలామంది మిత్రులు వీటిని పుస్తక రూపమ్లో తీసుకురమ్మని పలు విధాలుగా ప్రోత్సహించారు. కాని నాకెందుకో ఇష్టం కలగలేదు. ముద్రణకి మనసంగీకరించలేదు. ప్రత్యేకమైన కారణమేమి లేదు. అయినా వారి సలహాని త్రోసిపుచ్చలేదు. నే రాసుకున్న నోట్సు, సేకరించిన విషయాలు ఒక క్రమం లో ఉండాలని ఒక చిత్తు ప్రతిని తయారు చేసుకున్నాను. ఇది జరుగుతున్న తరుణమ్లో విదేశాల్లో ఉంటున్న మా అన్నయగారి పాపకి పెళ్ళి కుదిరింది. కాకినాడలో పెళ్ళి . పెళ్ళి పనులు కొన్ని అన్నయ నాకప్పగించాడు. వాటికోసం కాకినాడ, వైజాగ్ తిరుగుతూంటే మా బంధువుల్లో ఒక పెద్దాయన " అవున్రా చిట్టీ నీ మేనకోడల పెళ్ళి కి ఓ చిన్న పెళ్ళి పుస్తకం అచ్చువేయించి అందరకీ పంచవచ్చుకదా " అని సలహా ఇచ్చాడు. ఎందుకో ఆ ఐడియా అద్భుతంగా అనిపించింది. వెంటనే ప్రెస్ వాళ్ళని సంప్రదించి రెం డువేల కాపీలు (జేబులో పెట్టుకునే సైజులో) ముద్రించి పెళ్ళిలో అందరికీ పంచిపెట్టాను.కొన్ని తెలిసినవారికి, మా స్కూలు పేరెంట్స్ కిపంచిపెట్టాను. అందరూ ఎంతో మెచ్చుకున్నారు. ఇది జరిగి మూడు సంవత్సరాలు పైనే అయింది. నాకు తెలియని వాళ్ళు కూడా నాకు ఫోను చేసి మరీ అభినందనలు తెలిపారు. (వాళ్ళకి నా పుస్తకం ఎలా చేరిందో నాకు తెలియదు) అయినా నాకెందుకో తృప్తి కలగలేదు. ఏదో వెలితిగానే ఉండేది. ఇదుగో ఆ సందర్భం లో నా ఫ్రెండ్ మాలతి ఇవన్నీ బ్లాగులో పెట్టమని సలహా ఇచ్చింది. సో అలా గత సంవత్సరం అక్టోబరు నెలలో మొదలయిన ' నా భావనలు ' బ్లాగులో ' పెళ్ళి పుస్తకం ' అనే పేరుతో ఒక వర్గాన్ని మొదలుపెట్టాను. ప్రపంచం నలుమూలలనుండి ఎంతో మంది తెలుగు బ్లాగర్లు అభినందించారు, ఆశీర్వదించారు... అందరికీ పేరు పేరున నెనర్లు. కొందరైతే క్రిస్టియన్, ముస్లిం మత వివాహ ధర్మాలనికూడా వ్రాయమని అడిగారు. ఇది అంతర్లీనంగా నా బాధ్యతని పెంచింది. అంతకంటే ఎక్కువగా వారి సలహా నన్ను ప్రేరేపించింది. అందుకే ఇతర మతాలలో జరిగే వివాహ తంతులగురించి అధ్యయనం మొదలు పెట్టాను. ఈ రెండు నెలల అధ్యయనంలో ఎన్నో ఆశక్తికరమైన విషయాలు తెలిసాయి. అవన్నీత్వరలో మీతో పంచుకుంటాను.

మతమేదయినా వివాహ ధర్మమొకటే ' సహజీవన సౌందర్యం ' . పాశ్చాత్య నాగరికతా మోజులో పడి భారత యువత ఎంతగా భ్ర ష్టుపట్టిపోతుందో మనకి తెలియంది కాదు. ప్రేమ పేరుతో వంచనలు, దురాగతాలు అంతు లేకుండా పోతున్నాయి. భాధ్యతగల్లిన పౌరులే కాదు సమాజంలో హోదా,పరువు వున్నవారు కూడా ఈనాడు వివాహేతర సంబంధాలతో విచ్చలవిడి శృంగారాన్నిఇపుడు ఒక స్టేటస్ గా భావిస్తున్నారు. సర్వత్రా నైతిక విలువలు లోపిస్తున్నాయి.
యావత్ ప్రపంచం లోనే అత్యధిక యవశక్తి ఉన్నదేశం మన భారతదేశం. యువత సన్మార్గం లో నడుచుకుంటే భారతదేశాన్ని మించిన మరొ దేశం ఈ ప్రపంచం లో ఉండదంటే అతిశయోక్తి కాదు.

సంఘమ్లో సదాచారాలను, సాంఘిక న్యాయాన్ని విశ్వజనీనంగా ఏర్పాటుచేసి సువ్యవస్థను రూపొందిచిన వారు మన పూర్వీకులు. ప్రపంచం లో ఎక్కడా లేని వివాహ సంస్కృతి మనది. భిన్న కుటుంబం లో పుట్టి, భిన్న వాతావరణం లో పెరిగి, భిన్న అలవాట్లను, అభిప్రాయాలను కలిగి ఉన్న ఇద్దరు మనుషులను ఒక పసుపు తాడు ప్రేమానురాగాలతో ఆ జన్మాంతం కట్టిపడేసే పటిష్టమైన వివాహ బంధం మనది. మన పూర్వీకులు మనకందించిన ఈ సంస్కృతీ సంప్రదాయాలను మన ముందుతరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిది.
భారతీయ వివాహ పధ్ధతి యందలి పవిత్రత, గౌరవం , ఆశయం, ఆదర్శం ప్రపంచమందలి మరి ఏ యితర దేశమందుగాని, మతమునందుగాని గాన జాలము. ....అనిబిసెంటు.

Tuesday, December 22, 2009

పెళ్ళి పుస్తకం - 11



హిందూ వివాహ ప్రాశస్త్యము
పదకొండవ భాగము
తలంబ్రాలు:

పెళ్ళిళ్ళలో చిన్నలకు పెద్దలకు వేడుకగా కనపడే
తలంబ్రాలు కార్యక్రమం వెనుక ఎంత రహస్యం దాగి ఉందో
అప్పుడు చెప్పే మంత్రాలను చూస్తే మనకు తెలుస్తుంది.

తలంబ్రాలు పోసుకునేటప్పుడు వరుడు ఈ క్రింది మంత్రం చెప్పి
ముందు వధువు నెత్తిపై తలంబ్రాలు పోస్తాడు.

1. " ప్రజావే కామస్స వృధ్యతాం "
' నేను కోరిన సంతానము సమృధ్ధిగా నుండుగాక '

తరువాత వధువు ఈ క్రింది మంత్రాలు చెప్పి వరుని నెత్తిపై
తలంబ్రాలు పోస్తుంది.

2. " పశవో మే కామస్స మృధ్యతాం "
' నాకిష్టమైన పాడి పంటలు సమృధ్ధిగా నుండుగాక '

వరుడు ఈ క్రింది మంత్రాన్ని చెప్పి వధువు నెత్తిపై
రెండవ సారి తలంబ్రాలు పోస్తాడు.

3. " యజ్ఞోమే కామస్సమృధ్యతాం "
' నాకిష్టమయిన త్యాగం సమృధ్ధిగా నుండుగాక '

తరువాత ఇద్దరూ ఈ క్రింది మంత్రం చెప్పి తలంబ్రాలు
పోసుకుంటారు.

4. " శ్రియోమే కామస్సమృధ్యతాం "
' మాకు కావల సిన ధనం సమృధ్ధిగా నుండుగాక '

బ్రహ్మగ్రంధ్రి లేదా బ్రహ్మముడి :

హోమసమయమ్లో దంపతులిరువురు విడిపోకుండాను,
దూరం కాకుండాను పురోహితుడు ఇరువురి కొంగులను ముడి వేస్తూ
ఈ మంత్రమును చదువుతాడు.

" ధృవంతే రాజ వరుణో ధ్రువంతెనో బృహస్పథి:
ధ్రువంచ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్ర ధారయతాంధ్రువం "

ఈ దాంపత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు రాజగు
వరుణుడు,దేవుడగు బృహస్పతి, ఇంద్రుడు
అగ్ని స్థ్రిరత్వమును కలుగుజేయుదురుగాక!

" గృహ పత్నీ హధా సోవశినీత్వం విదధం ఆవదాసి "

' ఇంటి యజమానురాలుగా సర్వమునకు పెత్తనము వహించి
తీర్చిదిద్దుకొను దానవుగా ఇంటికి రమ్ము '
అని వరుడు వధువు చేయి పట్టుకొం టాడు.

పాణి గ్రహణము మరో టపాలో

కొసమెరుపు:

1. Women are unpredictable. Before marriage,

she expects a man, after
marriage she suspects

him, and after death she respects him.


2. "What's the matter, you look depressed."

"I'm having trouble with my wife."


"What happened?" "She said she wasn't

going to speak to me for 30 days.


" But that ought to make you happy."

"It did, but today is the last day."



Sunday, December 20, 2009

పెళ్ళిపుస్తకం-10



హిందూ వివాహ ప్రాశస్త్యము
పదవ భాగము
బండికాడి:

దీనికొక కధ ఉంది. అపాల అను ఒక అవివాహిత
యువతికి వళ్ళంతా బొల్లి వ్యాధి వచ్చి ఎవరూ
వివాహము చేసికొనలేదు. ఇంద్రుని గూర్చి యాగము చేసిన
అది తగ్గి పోవును. కాని వివాహము కానిది ఆ యాగము
చేయరాదు. అందుకు ఆమె విచారించుచు ఒక నదిలో
స్నానము చేయుచూ - ప్రవాహమున కొట్టుకొని
పోవుచుండగా సోమలత ఒకటి ఆమె దగ్గరికి కొట్టుకుని
వచ్చింది. ఆమె దానిని పళ్ళతో నమిలి ఇంద్రుని ఉద్దేశించి
నోటితో విడిచి పెట్టింది.
ఇంద్రుడు ఆ రసమును గ్రహించి జలమును తన రధము కాడి
రంధ్రము గుండా పోనిచ్చి ఆ జలమును ఆమెపై చల్లుతాడు.
రోగవిముక్తురాలైన ఆమెకు సూర్య వర్చస్సు వస్తుంది.
ఈ సంప్రదాయం లో
ఉత్తర దక్షిణముగా కాడిని పట్టుకొంటారు.
దక్షిణమున ఉన్న రంధ్రము గుండా వరుడు
నీటిని చల్లుతాడు. ఈ పవిత్ర జలములచే
వధువు పవిత్ర రాలగుతుంది.

"అవీరఘీ: ఉదచంతు అత:"

వీరులైన సంతతికి అరిస్టము కులుగకుండ
ఈ జలములు క్షాళనముచేయు గాక !

"ఖేఅనవ: ఖేరద: ఖేయుగస్య శచీపతే
అఫాలాం ఇంద్రత్రి: పూర్త్యకరత్ సూర్యవర్చసవ "

గగనమున పోల్చలేని రధమును నడుపు ఓ శచీపతి!
అపాలా(ఎవరి పాలనలో లేని) అయిన ఈమెను సూర్యుని
తేజస్సుగల దానినిగా మూడు మార్లు చేయుగాక.
తరువాత కాడి రంధ్రము గుండా బంగారము
(మంగళ సూత్రము) పోనిచ్చి నీరు చల్లుతూ

"శనై హిరణ్యం సము వంతు ఆప:
శనై మేధ భవంతు"

బంగారు వెలుగులు మెల్లగా జలమును
చేరి సారవంతముగాక .
మిగతా మంత్రములు వధువుని నూరు రెట్లు
పవిత్రురాలగుటకు, శాంతి నివ్వగలందులకు చెప్పును.

యోక్త్ర ధారణ : ( వధువును త్రాటితో చుట్టుట )

"ఆశాసానా సౌమనసం ప్రణాం సౌభాగ్యం తనుం
అగ్నే రనూరతా భూత్వాసన్న హ్యేనుకృతాయకం"

మచి మనస్సును, మంచి సంతతిని, సౌభాగ్యాన్ని
మంచి తనువును కలిగి ఉండి అగ్నిహోత్రమున
నాకు సహచారిణివై సత్కా ర్య ములకు సంసిధ్ధువు కమ్ము.

మంగళ సూత్రధారణ:

వరుడు సంకల్పించి మాంగళ్యదేవతను ఆహ్వానించి
షోడశోపచారాలతో మంగళసూత్రమును పూజించును.
సభలోని వారిచే దానిని సృశింప చేస్తారు.
తరువాత వరుడు ఈ మంత్రం
చెపుతూ సూత్రమును కట్టును.

"మాంగళ్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బధ్నామి శుభగేత్వం జీవ శరదశ్శతం "

నా జీవనమునకు హేతువైన ఈ సూత్రము
చేత నేను కంఠమున మాంగల్యమును కట్టుచున్నాను.
నూరు సం వత్సరములు జీవించుము.

తలంబ్రాలు మరో టపాలో.......

కొసమెరుపు:
1. In the first year of marriage,
the man speaks and the woman listens.
In the second year, the woman speaks and the man listens.
In the third year, they both speak and the neighbors listen.

2. Love is blind but marriage is an eye-opener.