వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ
పెళ్ళిపుస్తకం..14 వ భాగం.
కాశీకి పోవుట:
బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు.
మధుపర్కము :
వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి.
గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ :
వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును.
కన్యాదాత వరుని పూజించుట :
కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును.
జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము.
అరుంధతి దర్శనము :
వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము
వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము.
కొసమెరుపు:
ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి
మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.
Showing posts with label సంబంధాలు. Show all posts
Showing posts with label సంబంధాలు. Show all posts
Sunday, April 10, 2022
పెళ్ళిలో జీలకర్ర, బెల్లం ఎందుకు ? పద్నాల్గవ భాగం
వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ
పెళ్ళిపుస్తకం..14 వ భాగం.
కాశీకి పోవుట:
బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు.
మధుపర్కము :
వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి.
గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ :
వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును.
కన్యాదాత వరుని పూజించుట :
కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును.
జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము.
అరుంధతి దర్శనము :
వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము
వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము.
కొసమెరుపు:
ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి
మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.
Labels:
ఆంధ్రవివాహాలు,
సంబంధాలు,
సహజీవనం,
హిం దూ వివాహాలు.
Monday, October 19, 2009
పెళ్ళి పుస్తకం.. రెండో భాగం
రెండవ భాగము
మహర్షిభిర్మంగళశీలవద్భి:ఆభ్యూహితో నుష్ఠిత ఆదరేణ
చిరాదయం విశ్వజనీన ఆర్యా:
వివాహసందా నితరాం సమింధామ్||
వివాహసందా నితరాం సమింధామ్||
భావం:- ఓ పూజ్యులారా ! వివాహమార్గమును రూపొందించినవారు శుభకరమైన శీలముగల మహర్షులు.
ఇది విశ్వజనీనము, ఇట్టి ఈ వివాహమార్గము ఆచంద్రార్కము మిక్కిలి ప్రకాశించు గాక!
ఉపోద్ఘాతము : దాంపత్యము సృష్ఠి ధర్మము. ఇది సర్వ జీవులకు సమానము. అందు మానవులకు బుధ్ధి ప్రసాదింపబడెను.
గనుక సంస్కారయుతమైన, ధర్మబధ్ధమైన జీవితము గడుపుట వారి కర్తవ్యమైనది. అదియే సుఖమును, ఆనందమును గలిగించును.హిందూ సంస్కృతిలో వివాహము కూడ ఒక సంస్కారము.దీనివలన మానవుడు పుట్టుక చేతనే ఋణపడియున్న దేవ, పితృ,ఋషి ఋణములలో పితృ ఋణమునుండి విముక్తుడగును.
కామము-గంధర్వశక్తి : ఉత్పత్తి, ప్రకృతి నడుపుటకు జీవరాసులే ఉపకరణ సాధనములు. జీవులచే దీనిని నడిపించుటకు, ప్రకృతి స్త్రీ పురుషుల ఆకర్షక శక్తిని ఉత్పత్తి చేయుచున్నది. దీనిని ప్రాచీనులు వివాహమునకు సంబధించిన గంధర్వుడు అని అన్నారు. గంధర్వుడగు శక్తి సోముడనబడు గ్రహాక్షరము యొక్క శక్తిపై ఆధార పడి వర్తించును. సోముడు చంద్రుని ద్వారా జీవులపై వ్యాపించి వయస్సు , లావణ్యము, ఆకర్షణము మున్నగు మనోధర్మములను కలిగించును. ఈ మనోధర్మములను ప్రకృతి మార్గము ననుసరించి పరమార్ధ సాధనములుగా వినియోగించుకొను సంస్కార మార్గమే మనువు మున్నగువారు రూపకల్పన చేసిన మంత్రపూజ, వివాహమార్గము, సంస్కారమునకు లొంగక విచ్చ్లవిడిగా వర్తించు వారి మనశ్శరీరములను ఈ గంధర్వ శక్తి యగు కామమే తుఫాను గాలిలో నావ వలె ధ్వంసము చేయును.
గృహస్థాశ్రమము ఉత్తమమైనది : ఋషుల సంప్రదాయమున దాంపత్యమునకు మానవుడు అందించు పారితోషికమే కామము, అనగా సృష్టికొరకు, ధర్మబధ్ధ మైన వంశాభివృధ్ధి కొరకు సంతానమును పొందు యజ్ఞకర్మయే కామమునకు ప్రయోజనము గాని ఇంద్రియలాలసతకుగాదుఅని చెపుతుంది.. కావుననే పూర్వము స్త్రీ, పురుషులు గ్రహములచే నిర్ణయింపబడిన కాలములందే సంభోగ ప్రక్రియను జరిపి మిగతా కాలమందు సహచరులుగా పని పాటలు చేసుకొనెడి వారు. గృహస్ఠాశ్రమము సంతతి పొందుటకు సంస్కార బధ్ధమైన ఏర్పాటు, కావున నాలుగు ఆశ్రమములలో ఉత్తమమైనదిగాఎంచబడినది. దాని పవిత్రత నిలుపుటకై స్త్రీకి పాతివ్రత్యము, పురుషునకు ఏక పత్నీ వ్రతము నియమితములైనవి.
కొసమెరుపు
దక్షిణ ఆసియా మరియు బంగ్లాదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో పెళ్ళి భోజనం అయిన తర్వాత " మాలా బందాల్ " అనే ఆచారం ఉంది.
వధూవరులపై ఒక సన్నటి వస్త్రాన్ని కప్పుతారు. ఆ వస్త్రం చాటున బొరానీ అను ఒక రకమయిన పానీయాన్ని ఒకరికి మరొకరు త్రాగిస్తూ.....
క్రిందనున్న అద్దమ్లో తమ ప్రతిబింబాన్ని చూసి ఒకరినొకరు అడుగుతారు.
నువు ఏం చూస్తూన్నావు ?
ప్రేమ పూరక స్పందన :-) " నా శేష జీవితాన్ని "
ఆ తర్వాత వధూవరులు దండలు మార్చుకుంటారు. అయితే ఈ మధ్య కాలం లో ఉంగరాలు కూడా మార్చుకుంటూన్నారు.
హిందూ వివాహంలో రకాలు.... మరో టపాలో....
Labels:
పెళ్ళి పుస్తకం,
మాట్రిమోనియల్,
వివాహాలు,
సంబంధాలు
Subscribe to:
Posts (Atom)