వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ
పెళ్ళిపుస్తకం..14 వ భాగం.
కాశీకి పోవుట:
బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు.
మధుపర్కము :
వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి.
గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ :
వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును.
కన్యాదాత వరుని పూజించుట :
కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును.
జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము.
అరుంధతి దర్శనము :
వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము
వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము.
కొసమెరుపు:
ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి
మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.
Showing posts with label సహజీవనం. Show all posts
Showing posts with label సహజీవనం. Show all posts
Sunday, April 10, 2022
పెళ్ళిలో జీలకర్ర, బెల్లం ఎందుకు ? పద్నాల్గవ భాగం
వివాహ ప్రక్రియ లోని ముఖ్యమయిన వాటికి వివరణ
పెళ్ళిపుస్తకం..14 వ భాగం.
కాశీకి పోవుట:
బ్రహ్మచారి చదువు ముగిసిన పిమ్మట గురువు ఆజ్ఞగొని యాత్రకు మరలుట (సమావర్తనము) ఒక ఆచారముగా ఉండేది (ఇప్పటికీ కొన్ని వర్ణాలలో ఈ తంతు ను చూడగలం). ఆ యాత్ర ఒక సమ్వత్సరం పరిమితి ఉండేది. ఆ దీక్షలో గురువు శిష్యునకు క్షురకర్మ(గుండు గీయించి) చేయించి, నూతన వస్త్ర ధారణ గావించి తర్వాత గురుదక్షిణ, దానితో ఆవును, దూడను, ఎద్దును స్వీకరించి సమావర్తనము చేయిస్తారు. ఈ సమయమున గొడుగు, చెప్పులు మొదలగు సామాగ్రిని సంసిధ్ధము చేసికొని, గురువునకు ఈ సామాన్లని దానము చేసి, బ్రాహ్మణులను పూజించి ప్రతి లోపమునకు ప్రాయశ్చిత్తముగా వారి అనుగ్రహమును పొంది బయలుదేరవలెను. ఈ తంతునే కాశీకి పోవుట అని క్లుప్తంగా అంటారు. పాద యాత్ర చేస్తున్న స్నాతకుని చేరి కన్యాదాత తన పుత్రికను దానము చేయుదననియు, అగ్నిసాక్షిగా పాణిగ్రహణము చేయుమనియు కోరును. అపుడు స్నాతకుడు కాశీ ప్రయాణము విరమించుకొని కన్యను వివాహ మాడతాడు.
మధుపర్కము :
వరుడు అలంకృతుడై మంగళగీతికలతో, వేదమంత్రములతో చక్కని వాహనమున పెండ్లివారి యింటికి బయలుదేరును. వీరిని ఆహ్వానించి కన్యాదాత మధుపర్కము నొసగును. వరుడు మత్రపూతకముగా మధుపర్కమును స్వీకరించును. మధుపర్కమనగా తీయని పానీయం. మధువు (తేనె)తో పాలు మొదలగు వాటిని కలిపి తయారు చేయుదురు. ఇది సేవించిన తర్వాత వరుని వస్త్రాదులతో సన్మానిస్తారు. ఇది తెలియక మధుపర్కములు అనగా పెళ్ళిలో కట్టుకొను వస్త్రములు అను పొరపాటు అభిప్రాయం నేడు వ్యాపించింది. ఇంకా విచిత్రమేమంటే " జరీ మధుపర్కములు " అను పద ప్రయోగాలు కూడా అజ్ఞానము వలన తయారయినవి.
గౌరీ పూజ లేదా లక్ష్మీపూజ :
వధువు ఈ పూజ చేయుట వలను వధువునకు మాంగల్యాభివృధ్ధి కలుగును.
కన్యాదాత వరుని పూజించుట :
కన్యాదాత వరుని పాదములు కడిగి పూజించును. నిజానికి వరుడు కన్యాదాత కన్నా వయసులో చిన్నవాడు. వయసులో పెద్దవాడు తనకన్న చిన్నవాని పాదములు తాకుట, కడుగుట సామాన్యముగా లోకాచారము కాదుగాని, ఇది వివాహములో ఆచారము. దీనికి కారణము మంత్రములలో చెప్పబడింది. ఇక్కడ వరుడు లక్ష్మీనారాయణ స్వరూపుడు. ఇతడిని పూజించి, కాళ్ళని కడిగి, జలధారతో కన్యను దానమిచ్చుట (కన్య ధారపోయుట) మహాభాగ్యముగా భావించబడును.
జీలకర్ర, బెల్లము :
శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (Material Scientists) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (Positive electric charge) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము.
అరుంధతి దర్శనము :
వివాహ ప్రక్రియలో వధూవరులను అరుంధతీ దర్శనం చేయిస్తారు. అరుంధతి అనగా ఎటువంటి పరిస్థితిలోనూ ధర్మమునకు హాని కలిగింపనిది అని అర్ధం. నూతన దంపతులు కామమునకే ప్రాధాన్యమీయకుండా ధర్మమునకే ప్రాధాన్యమిచ్చి లోకములో ఆదర్శ దంపతులుగా మెలుగుటకు కావలసిన దీవెనలు అరుంధతీ వశిష్టుల దర్శనము
వలన పొందింపచేయటమే మన పెద్దల ఉద్దేశ్యము.
కొసమెరుపు:
ఒక యువతి త్రాచుపాముతో ప్రేమలో పడి పెళ్ళాడిన ఉదంతం 07.06.2006 న రెండువేల మంది సమక్షమ్లో జరిగింది. ఒరిస్సా రాజధానికి దగ్గరలొ అటాలా పల్లెకు చెందిన బింబాలా దాస్(30) అనేయువతి తాను తాచుపాముని ప్రేమిచానని పెళ్ళాడతానని ప్రకటించింది. మూఢనమ్మకాలకు నిలయమైన ఆ గ్రామ ప్రజలు పాము పుట్ట పక్కనే వివాహ వేదిక చేసి
మంత్రోఛ్ఛారణతో తంతు నిర్వహించారు. వరుడు (పాము) పాపం ఎంతకీ పుట్టలోంచి రాకపోవడంతో పాము లోహ ప్రతిమను పెట్టి తంతు కానిచ్చేసారు.
Labels:
ఆంధ్రవివాహాలు,
సంబంధాలు,
సహజీవనం,
హిం దూ వివాహాలు.
Saturday, October 9, 2010
ఈ కధకి పేరు పెట్టండి..

నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు. రావాల్సిన బస్సు కోసం అసహనంగా అటూ, ఇటూ చూస్తూంది కాజల్. ఎదురుచూసే బస్సు రాకుండా ఎక్కడికి పోతుంది. బస్సు వచ్చేవైపే కాదు, రాని వైపుకూడా చూడటం ఆరాటానికి పరాకాష్ట. అయితే రావాల్సిన బస్సు కంటే వేగంగా ఆమె ఆలోచనలు పరిగెడుతున్నాయి. సరిగ్గా నిన్న ఇదే సమయానికి జరిగిన సంఘటన తన కళ్ళముందు కదలాడింది. .
నిన్న బస్సు కోసం ఎదురు చూస్తూన్నపుడు ఎవరో ఒక ఇరవై, ఇరవైఐదు సంవత్సరాల యువకుడు రోడ్డు క్రాస్ చేస్తూ బైక్ గుద్ది పడిపోయాడు. అందరూ అతన్ని ముందు తిట్టినా తరువాత అతడు గుడ్డివాడని తెలిసి జాలిపడి బైక్ అతన్ని తిట్టారు.
తనకేమీ పట్టనట్లు అతను నవ్వుకుంటూ తను వెయిట్ చేస్తున్న బస్టాప్ దగ్గరకి వచ్చేడు. నెమ్మదిగా నడుచుకుంటూ తనకు దగ్గరగా వచ్చి... ఏవండీ 28 వచ్చిందాండి. అందం, ఆకర్షణ అన్నీ ఉన్న ఇతనికి దేవుడు అన్యాయం చేసాడనిపించింది. ఏవండీ మిమ్మల్నే... ఉలిక్కి పడింది కాజల్...ఇంకా రాలేదండి. నేనూ దానికోసమే వెయిట్ చేస్తున్నాను. రాంగానే మిమ్మల్ని ఎక్కిస్తాను. చాలా ధాక్సండి.. మీకెందుకండి శ్రమ ..నేనెక్కగలను. బస్సు వచ్చినపుడు చెప్పండి చాలు. మీరేమనుకోనంటే ఒక చిన్న మాట..మాలాటి వికలాంగుల మీద సానుభూతి చూపించండం నాకిష్టం ఉండదండి. అది మా ఆత్మవిశ్వాసాన్ని దిగజార్చుతుందని నా భావన. వీలయినంత వరకూ ఎవరి మీద ఆధార పడకుండా మా పనులు మేము చేసుకోవడంలోనే మాకు తృప్తి ఉంటుందండి.
ఐయామ్ సారి నా గురించి చెప్పనేలేదు కదూ. నా పేరు ఉదయ్. అనాధాశ్రమంలో జీవన ప్రస్థానం మొదలైంది. రైల్వే న్యూకాలనీలో ఉన్న బ్లైండ్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను...మీరు ఏ కాలేజిలొ చదువుతున్నారు. మీరు కాలేజి చదువుతున్నట్లు ఎలా తెలిసిందని అవాక్కయ్యారా ? ఇందులో విచిత్ర మేముందండి. మీరు వాడే పెర్ఫ్యూమ్ కాలేజ్ స్టూడెంట్స్ తప్ప మరెవరూ వాడరు కదా. తను నిజంగానే అవాక్కయింది. నోటమాట రాలేదు. మాట్లాడే అవకాశము రాలేదు. తన నిశ్శబ్దాన్ని ఛేధిస్తూ 28 బస్సు హారన్ మ్రోగింది. చూస్తుండగానే అతను బస్సు ఎక్కడం, తరువాత హడావుడిగా తను ఎక్కడం జరిగిపోయింది. బస్సులో విడివిడిగా కూర్చున్నా ఒకరు మరొకరి గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. ఆలోచనలో ఉండగానే అతని బస్టాప్ వచ్చింది. తను దిగిపోయాడు.
బస్సు కదిలింది. వెంటనే తను సీట్లోంచి లేచి అంకుల్ కొంచెం స్లో చేయరా నేనిక్కడే దిగాలి. స్టాప్ లో దిగాలమ్మా, ఎక్కడపడితే అక్కడ బస్సాపరు అంటూనే బస్సు స్లో చేసాడు. దిగి వెనక్కి చూసింది. చాలా దూరంలో ఉన్నాడు. మళ్ళీ ఆలోచనలు..... తను దిగాల్సింది మరో రెండు స్టాపుల తర్వాత. మరి ఇక్కడ ఎందుకు దిగింది. అతని గురించా ? అతనితో ఏం మాట్లాడుతుంది తనకే తెలియదు. సెల్ తీసుకుని మాధవికి ఫోన్ చేసి అటెండెంస్ మేనేజ్ చేయమని చెప్పింది. ఇపుడేం చేయాలి. వెనక్కి చూసింది. అతనెవరితోనో మాట్లాడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు. తను నడక మొదలు పెట్టింది. దగ్గర కొచ్చేకా...అరె మీరా... మీరిక్కడే దిగారా ? కాలేజ్ కి వెళ్ళలేదాండి.
లేదండి..ఇక్కడ ఒక అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాలి. ఆ పని అయిపోయాకా కాలేజికి వెళతాను. తనకి తెలుసు అది అబధ్ధం అని....బహుసా అతనికి కూడా.. అయినా ఎందుకు చెపుతున్నట్లు.. ఆతన్ని చూడంగానే పరిచయం పెంచుకోవాలని ఎందుకనిపించింది. అదీ తెలియదు. ఇరువురు పరిచయాలు చేసుకోంగానే అతని స్కూలు వచ్చేసింది.
బస్సు హారన్ మ్రోగేసరికి ఊహల్లోంచి బయట పడింది. కొంచెం దూరంలో ఉదయ్ ఉన్నాడు. తనొచ్చేవరకూ బస్సు ఆపింది. రోజు ఇలాగే కలుసుకోవడంలో వారి అనుబంధం పెరిగింది.
తను కూడా అనాధే. చిన్నప్పటి నుండి ఒక దాత చదివించాడు. అతను కాస్తా మరణించేసరికి ఆమె చదువు మధ్యలోనే ఆగిపోయింది. వర్కింగ్ విమెన్ హాస్టల్ లో ఉంటూ ఏదో చిన్న షాపులో పార్టైమ్ స్టోర్స్ మేనేజర్ గా పనిచేసుకుంటూ చదువు కుంటుంది.
ఇద్దరికీ కులం, మతం అడ్డుగోడలు లేవు. తల్లి దండ్రుల ఆంక్షలు లేవు. సో... వారి ప్రేమకి ఎల్లలు లేవు. అలాగని ఎవరూ హద్దులు దాటలేదు.
తరచూ పార్కుల్లోనూ బీచ్ ల్లోనూ కలుసుకోవడం వారిని వివాహ బంధానికి దారి తీసింది.
ఒక రోజు....నాకు కళ్ళు వచ్చే అవకాశాలున్నాయని డాక్టర్లు చెప్పారు. నేత్రదాతలకోసం వెతుకుతున్నాను. నాకు చూపు రాగానే మనిద్దరం పెళ్ళి చేసుకుందాం అన్నాడు.
ఆ రోజు రాత్రి కాజల్ కి నిద్రపట్టలేదు. ఎలాగైనా అతనికి చూపు రప్పించాలి. రెండు రోజులు అతన్ని కలవలేదు. ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేసింది. అతని రిపోర్ట్స్ చేతబట్టుకుని నగరంలో ఉన్న కంటి హాస్పటల్స్ చుట్టూ తిరిగింది. మొత్తానికి శంకర్ ఫౌండేషన్ హాస్పటల్ లో అపాయింట్ మెంట్ సాధించింది.
మరో పది రోజుల్లో అతనికి ఆపరేషన్. ఈ విషయం అతనికి చెప్పింది.
తన చీకటి తెరలు తొలగిపోయే రోజుకోసం ఇద్దరూ ఉత్కంఠతో ఎదురుచూసారు.
కళ్ళు వస్తే ఈ లోకంలోని రంగులన్నీ తెలుస్తాయి.
ప్రకృతిలోని అందాలన్నీ చూడగలుగుతాడు. ఆ ఊహే అతణ్ణి ఉద్వేగపరచింది.
ఆపరేషన్ అవ్వంగానే కళ్ళు తెరచి మొదట తననే చూడాలని అన్నాడు.
ఆపరేషన్ అయ్యింది.
తను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తన రూపం.. మసక మసకగా క్రమంగా రూపుదిద్దుకుంది.
అతని మనో నేత్రంలో ఆమె రూపం సజీవంగా..... ఎదురుగా.....
పెళ్ళి గురించి అడిగింది..చూద్దాంలే..అప్పుడేనా...తర్వాత మాట్లాడుకుందాం...
డిస్చార్జ్ రోజున అడిగింది...ఆలోచిస్తాన్లే అన్నాడు....
అతనికి దగ్గరగా వచ్చింది.. కళ్ళని ముద్దాడింది....
నా కళ్ళు జాగ్రత్త......అని వెళిపోయింది.....
నగరాన్ని పిండితే రాలినట్లు రోడ్లన్నీ జనమయం. ఎవరి బిజీ లోవాళ్ళు. ఆఫీసులకెళ్ళే వాళ్ళు. పిల్లలని స్కూలుకి, కాలేజీలకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, రోడ్లు క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూన్నవాళ్ళు కొబ్బరి బొండాలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు అమ్మేవాళ్ళు ఎవరి అవసరాల్లోవారు.
కళ్ళ చుట్టూ ఉండాల్సిన కాటుక (కాజల్) చీకటిని కళ్ళల్లో నింపుకుని....
రావాల్సిన బస్సు కోసం అసహనంగా ఎటో చూస్తూంది కాజల్....
Wednesday, March 24, 2010
అసహజ జీవనం ?
నిజమే...ఈ దేశ పౌరుని జీవన విధానాన్ని నియంత్రించే చట్టాలేమీ మన భారతీయ శిక్షాస్మృతి లో లేక పోవడం దురదృష్టకరం. మన సంస్కృతిని కాపాడ వలసిన ధర్మాన్ని, బాధ్యతని యువత విస్మరించడం కూడా నేరపరిధిలోకి రాదు. ప్రపంచం లో అత్యధిక శాతం యవత/యువశక్తి కలిగిన మనదేశ పౌరుడు పెడదోవ పడుతున్నా, ఈ దేశ చట్టాలు, సమాజం ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. ఎందుకంటే social conduct of an individual is not legalised. No law can prevent the fall of moral values of an indiviual.
వివాహానికి ముందు శృంగారం మంచిదా, కాదా అనేది మనిషి వ్యక్తిత్వం, కుటుంబ నేపధ్యం మీద ఆధారపడిఉంటుంది. చదువు, సంస్కారం ఉన్నయువతకి కొంత విచక్షణా జ్ఞానం ఉంటుంది. గ్రామీణ సమాజం లో ఇటువంటి ఆచారం అనాదిగా ఉన్నప్పటికీ ఇది సంస్కృతి మీద అంత ప్రభావం చూపక పోవచ్చు.
స్త్రీ, పురుషులు వివాహం చేసుకోకుండా సహజీవనం (Dating) సాగించడం.. మన వివాహ వ్యవస్థ మీద చాలా ప్రభావం ఉంటుంది. పటిష్టమయిన వివాహ సంప్రదాయానికి చరమగీతం పాడినట్లే. దేశవిదేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన మన వివాహ విధానం లోని ఆచార వ్యవహారాలను అటకెక్కించినట్లే. అభివృధ్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా భారత్ ను నిలబెడుతున్న అనేక అంశాల్లో ఈ దేశ సంస్కృతి ఒకటి. ఎంతో మంది విదేశీయులు మన వివాహ వ్యవస్థని అధ్యయనం చేసి.. భారతదేశం లో కుటుంబ వ్యవస్థకు మూలాలు వివాహ మంత్రాలలోనూ, వివాహ సంప్రదాయం లోను, వారి కట్టుబాట్లలోనూ ఉందని కొనియాడేరు.
ఈ సహజీవనం దేశ నైతిక విలువలపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది అనడం లో సందేహం లేదు. ఆడ మగ డేటింగ్లో ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఎన్ని అనర్ధాలు వస్తాయో అనూహ్యం. అంతేకాదు రాధాకృష్ణుల మధురానుబంధాన్ని..మానవమాత్రుల విచ్చలవిడితనంతో సరి పోల్చడం వారి విజ్ఞత కి వదిలేయాలి.
కొసమెరుపు : సీతారామ కల్యాణమందు ప్రస్తావించిన మంత్రోపదేశాలే నేటికీ మన హిందూ వివాహ విధానమ్లో అనుసరిస్తున్నాం.
సీతారాముల దాంపత్యమంత అన్యోన్యంగా ఉండాలని ఆ మంత్రముల అర్ధం.
లోక కల్యాణరాముని కల్యాణం జరుగు శ్రీరామ నవమి రోజున ఇటువంటి వార్త వినడం.
Subscribe to:
Posts (Atom)